రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు

Presidential Poll: వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి, పీవీ మిథున్‌ రెడ్డి హాజరు

Update: 2022-06-24 02:34 GMT

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు

Presidential Poll: రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడాన్ని YCP స్వాగతిస్తోంది. NDA రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు తెలిపింది. ఇవాళ ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వెళ్లాలని సీఎం జగన్ భావించారు.

కానీ ఇవాళే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడంతో ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం జగన్‌ హాజరు కాలేకపోతున్నారు. వైసీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ పార్టీ పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి హాజరు కానున్నారు.

Tags:    

Similar News