రాజ్‌నాథ్‌సింగ్‌తో రఘురామకృష్ణరాజు భేటీ

Update: 2020-06-27 05:35 GMT

ఏపీలో రాజకీయాలు కాక‌రేపుతున్నాయి. అధికార పార్టీలో ముస‌లం తార‌స్థాయికి చేరింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజు నిన్న ఢిల్లీ వెళ్లారు. నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఈసీని కలిసిన రఘురామకృష్ణరాజు శనివారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శరద్‌యాదవ్‌ తరహాలో రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్‌ వేటే వేస్తారని, పార్లమెంట్‌లో కూడా నిర్ణయం తీసుకునేలా చర్యలు ఉంటాయని వైసీపీ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన.. రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రఘురామ కృష్ణంరాజు ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చర్చ‌కు దారితీసింది.

Tags:    

Similar News