కాసులకు కక్కుర్తి పడిన ఓ మహిళ చేయకూడని పని చేసి అబాసుపాలైంది. గోధుమపిండి ముద్దను కన్నబిడ్డగా చూపి అప్పనంగా డబ్బులు కాజేయాలనుకుంది. అయితే ఆమె పథకం పారలేదు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని మొరీనా జిల్లా కైలరాస్కు చెందిన ఓ మహిళ ''ఉదయ్ శ్రామిక్ సేవా సహాయత యోజన'' క్రింద గర్భిణుల షోషకాహారం కోసం రూ. 1400, కాన్పు తర్వాత రూ. 16 వేలు ఇస్తారని తెలుసుకుంది. దీంతో గోధుమపిండి ముద్దను అప్పుడే పుట్టిన బిడ్డలాగా తయారుచేసి దానికి ఎరుపురంగు పూసింది. ఆ ముద్దమీద గుడ్డకప్పింది. అనంతరం ఆ ముద్దను తీసుకొని అంబులెన్స్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చేరుకుంది. అక్కడ తన బిడ్డ పేరు నమోదు చేయాలనీ నర్సును కోరింది. అయితే నర్సు మాత్రం అందుకు నిరాకరించింది.
బిడ్డకు వైద్యపరీక్షలు చేసిన తరువాతే పేరు నమోదు చేస్తామని చెప్పి.. ఆమె చేతిలో ఉన్న ముద్దను తీసుకోబోయింది. దానికి ఆ మహిళ ఇవ్వనని చెప్పింది ఈ క్రమంలో నర్సుకు అనుమానం వచ్చి డాక్టర్ కు సమాచారం అందించింది. ఈ క్రమంలో నర్సు సదరు మహిళ మధ్య జరిగిన పెనుగులాటలో గోధుమ ముద్ద కిందపడింది. దాంతో తన బిడ్డను చంపేశారంటూ అక్కడినుంచి లంకించుకుంది మహిళ. పధకం పారకపోయే సరికి ఆమె అక్కడినుంచి పరారైంది. వాస్తవానికి ఇలా చేస్తే సులభంగా డబ్బులు వస్తాయని వాళ్లను ఆమెను ఎవరో తప్పుదోవ పట్టించినట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ ఘటనపై సదరు డాక్టర్లు, సిబ్బంది అవాక్కయ్యారు.