సజీవంగా చంపేస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లోక్సభలో సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే "దేశభక్తుడు" అని భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
లోక్సభలో సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే "దేశభక్తుడు" అని భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్పై క్రమశిక్షణ చర్యలు పేరిట బీజేపీ పక్షం కంటి తుడుపు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పార్లమెంట్ అట్టుడికింది. గాంధీ కంటే గాడ్సేనే బీజేపీకి అభిమానమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను సజీవ దహనం చేస్తానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లో బయోరా నియోజకవర్గ ఎమ్మెల్యే గోవర్థన్ డంగీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్లో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అడుగుపెడితే సజీవంగా అంతం చేస్తామని ప్రకటించారు.
మరోవైపు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వ్యాఖ్యలకు నిరసిస్తూ.. ఆమె సొంత నియోజకవర్గమైన భోపాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా తీవ్రంగా ఖండించారు.