వైరల్ : కమల్ హాసన్తో బ్రావో భేటీ
విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో, తమిళ అగ్రకథానాయకుడు మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
విండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో, తమిళ అగ్రకథానాయకుడు మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం చెన్నైకి చేరుకుని కమల్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రావో కమల్ హాసన్కు టీషర్టు బహుకరించారు. దానిపై ఆయన సంతకం కూడా చేశారు. వీరిద్దరు కలిసిన ఫోటోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
అయితే గత కొంత కాలంగా కమల్ అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. సర్జరీ అనంతరం ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆతర్వాత భారతీయుడు -2 చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే కమల్ ని కలిసిన బ్రావో ఆయనను పరామర్శించారు. బ్రావో వెస్టిండీస్ జట్టుకు దూరంగా ఉంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు క్రికెట్ లీగ్లుల్లో బ్రావో ఆడుతున్నారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రావో ప్రాతినిధ్యం వహించారు. ఇటీవలే గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఇన్సిపిరేషన్ అవార్డును బ్రావోను వరించింది.
టీమిండియా విండీస్ మధ్య జరుగుతున్నమూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ వీక్షించేందుకు బ్రావో వెళ్లే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లే కాకుండా అభిమానులు సైతం ఉఠ్కంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా నిలిచాయి. అయితే గురువారం జరగనున్న మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు టైటిల్ కైవసం చేసుకుంటుంది. వాంఖడేలో మొదట ఫీల్డింగే ఎంచుకునే జట్టు భారీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకునే అవకాశం ఉంది.