ఉగ్రవాదులకు పెస్షన్ ఇస్తున్న దేశం పాకిస్తాన్ ఒక్కటే
అణు యుద్ధం వస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐక్కరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఖండించింది. యూఎన్ లిస్టులో ఉన్న ఉగ్ర వాదులకు పెస్షన్ ఇస్తున్న దేశం పాకిస్తాన్ ఒక్కటేనని భారత విదేశాంగ కార్యదర్శి విదిశా మైత్రా తెలిపారు.
అణు యుద్ధం వస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐక్కరాజ్యసమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఖండించింది. యూఎన్ లిస్టులో ఉన్న ఉగ్ర వాదులకు పెస్షన్ ఇస్తున్న దేశం పాకిస్తాన్ ఒక్కటేనని భారత విదేశాంగ కార్యదర్శి విదిశా మైత్రా తెలిపారు. దాయిశ్, ఆల్ఖయిదా సంస్థలకు నిధులు నిరాకరిస్తూ యూఎన్ అంక్షలు విధించిన, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదులను ఆదుకుంటోందని విదిశా అన్నారు. అణుయుద్ధం వస్తుందని హైచ్చరించిన ఇమ్రాన్ వ్యాఖ్యలు ఆ దేశ వైఖరిని స్పష్టం చేస్తుందని భారత్ ఆరోపించింది. చరిత్రను వక్రీకరింస్తున్నారని, 1971లో స్వంత దేశ ప్రజలను ఊచకోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పాక్లో 1947లో 23 శాతం మైనార్టీలు ఉంటే, ప్రస్తుతం మైనార్టీల సంఖ్య కేవలం 3 శాతంమే ఉందని విదిశా అన్నారు. ఐక్కరాజ్యసమితి నిషేదించిన 130 ఉగ్రవాదులు పాక్ లోనే ఉన్నారని అలాగే 25 ఉగ్రవాద సంస్థలు అక్కడే ఉన్నాయని విదిశా వ్యాఖ్యానించారు.