ఉత్తరాఖండ్ మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో ఇప్పటివరకు 1 లక్ష 86 వేల 371 కరోనా సంక్రమణ కేసులు వచ్చాయి. ఢిల్లీలో వరుసగా నాలుగవ రోజు ఆదివారం వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి.

Update: 2020-05-31 16:31 GMT
Uttarakhand minister Satpal Maharaj(file photo)

దేశంలో ఇప్పటివరకు 1 లక్ష 86 వేల 371 కరోనా సంక్రమణ కేసులు వచ్చాయి. ఢిల్లీలో వరుసగా నాలుగవ రోజు ఆదివారం వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. గరిష్టంగా 1295 మంది రోగులు కనుగొనబడ్డారు, అలాగే 13 మంది మరణించారు. ఇప్పుడు అక్కడ మొత్తం 19 వేల 844 మంది తేలారు.. అలాగే ఇప్పటివరకూ 473 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉత్తరాఖండ్ చెందిన మంత్రి సత్పాల్ మహారాజ్ కు కరోనా సోకింది. ఆయన తోపాటు ఆయన సతీమణి అలాగే కుటుంబానికి సిబ్బందికి చెందిన మరో 17 మందికి సైతం వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.

కేంద్రం యొక్క మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు లాక్డౌన్ పెంచడం ప్రారంభించాయి. ప్రస్తుతం, జూన్ 30 వరకు మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్లలో లాక్డౌన్ కొనసాగుతుంది. అంటువ్యాధి ముప్పు కారణంగా జూన్ 15 వరకు ఆంక్షలు కొనసాగుతాయని మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ శనివారం తెలిపాయి.

Tags:    

Similar News