కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో, రాష్ట్రంలో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పిఆర్) 2021 వాయిదా వేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశ సెన్సస్ 2021 ఏప్రిల్ 1 న ప్రారంభం కావాల్సిఉంది.. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రజా జీవనమంతా స్థంభించిపోవడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్పీఆర్ ప్రక్రియను ఏడాది పాటు వాయిదా వేసింది. ఇక ఇప్పటివరకు 85,940 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,752 మంది మరణించారు.