జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతం

Update: 2019-11-11 06:30 GMT

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇవాళ మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని బందిపొర జిల్లాలో ఉన్నారనే సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల మృతదేహాలతోపాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఉగ్రవాదులు ఏ గ్రూపునకు చెందిన వారో ఇంకా తెలియలేదు.

Tags:    

Similar News