మోదీ ఎదుటే మహిళా మంత్రి నడుముపై చేయివేసిన మరో మంత్రి..

Update: 2019-02-12 14:46 GMT
ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న వేదికపై మంత్రి మనోజ్ కాంతి దేవ్ మహిళా మంత్రిపై అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపుర మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న సాంతనా చక్మా నడుము మీద చేయి వేసిన సంఘటన కెమెరాలకు చిక్కింది. దీంతో ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో చేరి వైరల్ గా మారింది. ఓ వైపు ప్రధాని, మరోవైపు ముఖ్యమంత్రి వేదికపై ఉన్న సమయంలో మంత్రి మనోజ్ కాంతి దేవ్ అసభ్యకర రీతిలో మహిళా మంత్రిని తాకడంతో ఇబ్బందిపడ్డ సదరు మహిళా మంత్రి అసహనంతో అతని చేతిని వెనక్కినెట్టింది.అయితే మంత్రి మనోజ్ ప్రవర్తనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.

Similar News