ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 303 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 82 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. బిల్ పాస్ అయిన తర్వాత సభ నుంచి కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ వాకౌట్ చేశారు.