Woman Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కళ్లల్లో కారం చల్లి, కాలితో గొంతు నొక్కి
Woman Kills Husband: పోలీసుల వివరాల ప్రకారం, ఆ రాత్రి శంకరమూర్తి నిద్రలో ఉండగా, సుమంగళ అతడి కళ్లలో కారం పొడి చల్లి, కర్రలతో మోదించి, మెడపై కాలుతో మోది హత్య చేశారట.
Woman Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కళ్లల్లో కారం చల్లి, కాలితో గొంతు నొక్కి
Woman Kills Husband: భారతదేశంలో భార్యలు తమ భర్తలను ప్రణయ సంబంధాల నేపథ్యంలో హత్య చేసే ఘటనలు గత కొంతకాలంగా పెరిగిపోతున్నాయి. తాజాగా, కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని తిప్తూరు తాలూకా కడశెట్టిహళ్లి గ్రామంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ సంఘటన జూన్ 24న చోటుచేసుకోగా, 50 ఏళ్ల శంకరమూర్తి అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆయన ఒక ఫామ్హౌస్లో ఒంటరిగా నివసిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఆయన భార్య సుమంగళ తిప్తూరులోని కల్పతరు బాలికల హాస్టల్లో వంటమనిషిగా పనిచేస్తుండగా, ఆమెకు కరదలుసంటే గ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది.
ఈ సంబంధం భార్య-భర్త మధ్య దూరాన్ని పెంచింది. చివరకు, ఈ వ్యవహారానికి అడ్డుగా మారిన భర్తను తొలగించాలన్న దురుద్దేశంతో సుమంగళ, నాగరాజు కలిసి హత్య కుట్ర పన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఆ రాత్రి శంకరమూర్తి నిద్రలో ఉండగా, సుమంగళ అతడి కళ్లలో కారం పొడి చల్లి, కర్రలతో మోదించి, మెడపై కాలుతో మోది హత్య చేశారట. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి, దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని తురువేకెరే తాలూకాలో బావిలో పడేశారు.
శంకరమూర్తి గల్లంతయ్యాడని నోనవినకెరే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, దర్యాప్తులో ఆయన మంచంపై కారం పొడి ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు సుమంగళపై అనుమానం పెట్టుకున్నారు. ఆమె ఫోన్ కాల్ వివరాలు పరిశీలించగా అసలైన కుట్ర బయటపడింది. చివరకు సుమంగళ నేరాన్ని అంగీకరించింది.
ప్రస్తుతం కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.