బార్లు తెరుచుకోవడానికి అనుమతులు

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా బార్‌లను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలను తెరిచాయి.

Update: 2020-06-24 06:02 GMT

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా బార్‌ లను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో చాలా రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలను తెరిచాయి. అయితే రాజస్థాన్ లో మాత్రం జూన్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ప్రారంభమైనప్పటికీ బార్లు మాత్రం తెరుచుకోలేదు. అయితే తాజాగా ఈ విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు తిరిగి తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది.

ప్రభుత్వ అనుమతుల నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్‌లు తెరుచుకున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ ఉండటంతో రాత్రి వేళ బార్ లు మూసివేయాల్సి ఉంది. ఇక మందుబాబులు సామాజిక దూరం పాటిచండం, శానిటైజేర్ తప్పక వాడటం తోపాటు ముఖానికి మాస్కు తప్పనిసరి చేస్తూ బార్లకు అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.


Tags:    

Similar News