PM Modi: రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారు
PM Modi: మణిపూర్పై చర్చ జరపాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదు
PM Modi: రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారు
PM Modi: రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిందన్నారు ప్రధాని మోడీ. హౌరాలో నిర్వహించిన క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని.. ప్రతిపక్షాల తీరును దుయ్యబట్టారు. మణిపూర్ పేరు చెప్పి రాజకీయాలు చేశారని.. అవిశ్వాస తీర్మానంలో మణిపూర్లో శాంతి కోసం చర్చ జరపాలనే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించి విపక్షాల అసత్య ప్రచారాలకు తగిన సమాధానం చెప్పామన్నారు ప్రధాని.