Supreme Court: యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: దీన్నొక అంతులేని కథగా మార్చకండి.. లఖింపూర్ ఘటన విచారణలో ప్రభుత్వ తీరుపై అసహనం

Update: 2021-10-20 15:21 GMT

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Supreme Court: లఖింపూర్ ఘటన విచారణలో యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీన్నొక అంతులేని కథగా మార్చకండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషంలో నివేదిక సమర్పించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Tags:    

Similar News