Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court: లంచం తీసుకుని ఓటు వేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు.. రాజ్యాంగ రక్షణ కోల్పోతారన్న ఏడుగురు సభ్యుల ధర్మాసనం
Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లంచం తీసుకుని ఓటు వేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు... రాజ్యాంగ రక్షణ కోల్పోతారని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు... విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. 1998లో జేఎంఎం కేసులో.. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.