Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం ఒకే...

పూరీ జగన్నాథ రథ యాత్రకు సుప్రీంకోర్ట్ ఒకే చెప్పింది. అయితే ఈ రథయాత్రలో భక్తులు లేకుండా నిర్వహించాలని, భక్తులకోసం రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది.

Update: 2020-06-22 07:57 GMT

పూరీ జగన్నాథ రథ యాత్రకు సుప్రీంకోర్ట్ ఒకే చెప్పింది. అయితే ఈ రథయాత్రలో భక్తులు లేకుండా నిర్వహించాలని, భక్తులకోసం రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. పూరీ జగన్నాథ రథయాత్రను నిలిపివేస్తూ జూన్‌ 18న ఇచ్చిన తీర్పును సవరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే నేతృత్వంలోని

ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. భక్తుల ప్రమేయం లేకుండా యాత్రను చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం పిటిషన్ కు అనుగుణంగా ఈ తీర్పు వచ్చింది. కాగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News