Tamil Nadu: కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..అగ్నికి ఆహుతైన డ్రైవర్

* కారులోనే అగ్నికి ఆహుతైన డ్రైవర్ * దిండిగల్ - తిరుచ్చి జాతీయ రహదారిపై ప్రమాదం * కారు నెంబర్ ఆధారంగా మృతుని వివరాలపై ఆరా

Update: 2021-08-22 06:15 GMT

కారు ఫైర్ ఆక్సిడెంట్ (ఫైల్ ఫోటో)

Tamil Nadu: కారులో మంటలు చెలరేగి ఓ డ్రైవర్ మృతిచెందిన ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చి జిల్లా మనప్పరాయి సమీపంలోని దిండిగల్ - తిరుచ్చి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న డ్రైవర్ తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో కారులోనే అగ్నికి ఆహుతయ్యాడు. మృతదేహాన్ని మనప్పరై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు నంబర్ ఆధారంగా మృతుని వివరాలు సేకరిస్తున్నారు.

Tags:    

Similar News