ప్రయాణికుల సౌకర్యార్ధం చెన్నై-సికింద్రాబాద్ మధ్య ప్రత్యెక రైళ్ళు
రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్ళను నడిపించడానికి రంగం సిద్ధం చేసింది.
రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్ళను నడిపించడానికి రంగం సిద్ధం చేసింది. ఎంజీఆర్ చెన్నై–సికింద్రాబాద్ మధ్య వారానికి రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. ఈ రైళు వివరాలు ఎంజీఆర్ చెన్నై –సికింద్రాబాద్ (06059/06060) స్పెషల్ ట్రైన్స్ చెన్నై నుంచి అక్టోబర్ 18, 20, 25, 27, నవంబర్ 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, డిసెంబర్ 1,6, 8, 13, 15, 20, 22, 27, 29 తేదీల్లో సాయంత్రం 7.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.25 కు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో రైళ్ళు సికింద్రబాద్ నుంచి అక్టోబర్ 19, 21, 26, 28, నవంబర్ 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30, డిసెంబర్ 2, 7, 9, 14, 16, 21, 23, 28, 30 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకుంటాయి.
కాచిగూడ–కర్నూలు మధ్య జనసాధారణ్ రైలు
మంగళవారం (15వ తేదీ) కాచిగూడ–కర్నూల్ మధ్య ప్రత్యేక జనసాధారణ్ రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. కాచిగూడ–కర్నూల్ (07023/07024) స్పెషల్ ట్రైన్ మంగళవారం ఉదయం 11.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15కు కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు సాయంత్రం 5 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి రాత్రి 9.30కు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ–నిజామాబాద్ (07013/07014) మంగళవారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.గంటలకు నిజామాబాద్ చేరుకుంటుంది. తిరుగి అక్కడనుంచి 3.40కి బయలుదేరి సాయంత్రం 7.30 కు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు.