మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి.. నివాళులర్పిస్తున్న ప్రముఖులు

Update: 2019-11-19 06:41 GMT
sonia gandhi pay tribute to indira gandhi on birth anniversary

 మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఆమె సమాధి ఉన్న శక్తిస్థల్ కు కాంగ్రెస్ నాయకులు దర్శిస్తున్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు ఇందిరా గాంధీ సమాధిపై పూలు చల్లి ఘన నివాళి అర్పించారు. శక్తిస్థల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నెహ్రు, ఇందిరా గాంధీ చిత్రపటాలను ప్రదర్శిస్తున్నారు.

ఆ తర్వాత సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇతర నేతలు ఇందిరా గాంధీ మెమోరియల్ ను సందర్శించారు. ఇందిరా గాంధీ ఫోటో ప్రదర్శనను తిలకించారు. వివిధ స్టాళ్లలోని వస్తువులను పరిశీలించి యాజమానులతో మాట్లాడారు. 

Tags:    

Similar News