Tamilnadu: ఆసక్తికరంగా తమిళ రాజకీయాలు

Tamilnadu: అన్నాడీఎంకే పార్టీ విషయంలో దూకుడు పెంచిన శశికళ * అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపు

Update: 2021-02-25 03:57 GMT

శశికళ (ఫైల్ ఇమేజ్)

Tamilnadu: అన్నాడీఎంకే పార్టీ తనదేనని మరోసారి పునరుద్ఘాటించారు శశికళ. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించిన చిన్నమ్మ తమకు ప్రధాన శత్రువు డీఎంకే మాత్రమేనని చెప్పారు. ఇక.. ఇదే సమయంలో శశికళ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా, శరత్‌కుమార్‌ చిన్నమ్మను కలిసి కొద్దిసేపు ముట్టడించారు. మొత్తానికి చిన్నమ్మ రీ ఎంట్రీతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తిగా మారాయి. 

Full View


Tags:    

Similar News