అనంతనాగ్ లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్

ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

Update: 2020-05-31 08:55 GMT

ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులు అనంతనాగ్‌లో దాక్కున్నట్లు భావిస్తున్నారు. అయితే ఎన్‌కౌంటర్ సమయంలో ఉగ్రవాదులు తప్పించుకొని ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి. దాంతో పోలీసులు, భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

కాగా నిన్న జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వాన్‌పోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంతరం ఉగ్రవాదుల దగ్గరినుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఇద్దరు స్థానిక ఉగ్రవాదులైన పర్వేజ్ అలియాస్ మొయిస్ , షకీర్ అలియాస్ జారార్లుగా గుర్తించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Tags:    

Similar News