కర్ణాటక రెబల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంలో ముగిసిన వాదనలు

Update: 2019-07-16 11:35 GMT

కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఎమ్మెల్యేల పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. రేపు ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. రాజీనామాలు, అనర్హత అంశాలు కలిపి చూడొద్దని రాజ్యాంగం ప్రకారం స్పీకర్ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని రెబల్ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశంతో రాజీనామాలు చేస్తే వాటిపై కచ్చితంగా స్పీకర్ విచారణ చేసి నిర్ణయం తీసుకుంటారని సీఎం కుమారస్వామి తరపున న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు. 

Full View

Tags:    

Similar News