Road Accident: మ‌హారాష్ట్రలో ఘోర ప్రమాదం:15 మంది మృతి

Update: 2021-02-15 04:12 GMT

మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం (ప్రతీకాత్మక చిత్రం)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లాలో కింగ్వాన్ దగ్గర ట్రక్కు బోల్తా పడటంతో 15 మంది కూలీలు మృతి చెందారు. ధులే నుంచి రావెల్ కు బొప్పాయి లోడ్ తో ట్రక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో 21 మంది కూలీలు ఉన్నారు.

మ‌హారాష్ర్ట‌లో ఆదివారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. జ‌ల్గావ్ జిల్లాలో జ‌రిగిన ట్ర‌క్కు ప్ర‌మాదంలో 15 మంది మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. అయితే బాధితులు ప్ర‌యాణిస్తున్న ట్ర‌క్కు అదుపుత‌ప్పి బోల్తా ప‌డ‌టంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Tags:    

Similar News