Republic day: దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు

* రాజ్‌పథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌కొవిండ్ * పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు

Update: 2021-01-26 05:04 GMT

Representational Image

దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో త్రివర్ణ పతకం రెపరెపలాడుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేసి జెండా గీతాన్ని ఆలపించారు. రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజ్‌పథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News