ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాంపర్ రహదారికి దిగువన 300 మీటర్ల ఎత్తునుంచి బొలెరో వాహనం దొల్లిపడింది. నిగులాసరి సమీపంలో ఐదో నుంబర్ జాతీయ రహదారి వద్ద ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

Update: 2020-06-18 08:12 GMT

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్యాంపర్ రహదారికి దిగువన 300 మీటర్ల ఎత్తునుంచి బొలెరో వాహనం దొల్లిపడింది. నిగులాసరి సమీపంలో ఐదో నుంబర్ జాతీయ రహదారి వద్ద ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం, సంగ్లా నుండి రాంపూర్ వైపు వెళుతోన్న బొలెరో జీప్ అకస్మాత్తుగా నిగుల్సరి సమీపంలో 300 మీటర్ల కందకంలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో మొత్తం ఐదు మంది ఉన్నారు.


Tags:    

Similar News