గోవాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

Goa: పనాజీలో ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ

Update: 2022-02-12 03:09 GMT

గోవాలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

Goa: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సీట్లను గెలుస్తుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. గోవాలో పర్యటిస్తున్న ఆయన పనాజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈసారి గోవాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొందరలోనే మేం గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. గోవాని కోల్ మైనింగ్‌గా చూడాలని ఎవరూ అనుకోవడం లేదన్నారు. గోవా అద్భుతమైన పర్యాటక కేంద్రం, అద్భుతమైన సంస్కృతి కలిగిందని తెలిపారు.


Tags:    

Similar News