రాహుల్ గాంధీయే కొనసాగాలని కోరుకుంటున్నారు: సీఎం భూపేశ్ బాఘేల్

Update: 2019-06-20 15:42 GMT

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఛత్తీస్ గఢ్ ము‌ఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఈరోజు కలిశారు. ఢిల్లీలోని నివాసంలో రాహుల్ తో సీఎం భూపేశ్ బాఘేల్ సమావేశమయ్యారు. అనంతరం భూపేశ్ బాఘేల్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారన్నారు. రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి అనుమానం అవసరం లేదని స్ఫష్టం చేశారు. అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఒక్క రాహుల్ గాంధీకి ఉందని భూపేశ్ బాఘేల్ అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించిన రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడ్డా తాను మాత్రం అడ్డుపడేది లేదని తాజాగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News