Rahul Gandhi: పెగాసస్ అంశంపై పోరాటానికి సిద్ధమైన రాహుల్

Rahul Gandhi: 14 పార్టీలతో కలిసి పోరాటానికి సిద్ధమయినట్లు ప్రకటన * ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ

Update: 2021-07-28 11:02 GMT

రాహుల్ గాంధీ (ఇమేజ్ ఎన్డీ టీవీ)

Rahul Gandhi: దేశ ప్రజల ఫోన్లలో కేంద్ర ప్రభుత్వం ఆయుధం పెట్టిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ ఫైర్ అయ్యారు. పెగాసస్ స్పైవేర్ అంశంపై వివిధ పార్టీల నేతలతో భేటీ అనంతరం మాట్లాడిన రాహుల్ బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద దేశద్రోహానికి పాల్పడిందని విమర్శించారు. పార్లమెంట్‌లో తమ గొంతు నొక్కేశారని, పెగాసస్ అంశంపై మాట్లాడనివ్వలేదని రాహుల్ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పెగాసస్‍ను కొన్నదా? లేదా? చెప్పాలని నిలదీశారు. దేశ ప్రజలపై దానిని వాడారా? లేదా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News