Bharat Jodo Yatra: ఇవాళ్టితో ముగియనున్న రాహుల్ భారత్ జోడోయాత్ర

Bharat Jodo Yatra: 135 రోజులు దాదాపు 3,500 కి.మీ. సాగిన యాత్ర

Update: 2023-01-29 05:04 GMT

Bharat Jodo Yatra: ఇవాళ్టితో ముగియనున్న రాహుల్ భారత్ జోడోయాత్ర

Bharat Jodo Yatra: రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమైంది. 135 రోజుల్లో దాదాపు 3వేల 500 కిలో మీటర్లు యాత్ర కొనసాగింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యాత్ర ముగియనుంది. శ్రీనగర్‌ బోలివార్డ్‌ రోడ్డులోని నెహ్రూ పార్కు వరకు యాత్ర సాగనుంది. రేపు శ్రీనగర్‌ ఎంఏ రోడ్డులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాహుల్ జెండా ఎగుర వేయనున్నారు. అనంతరం ఎస్‌కే స్టేడియంలో విపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు 23 ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు.

Tags:    

Similar News