Punjab Politics: త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్

* ఊహించని మలుపులు తిరుగుతున్న పంజాబ్ రాజకీయాలు * బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న అమరీందర్‌ సింగ్

Update: 2021-10-20 01:41 GMT

త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్(ఫైల్ ఫోటో)

Amarinder Singh: పంజాబ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌గా మారనున్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన ఆయన.. త్వరలోనే ఓ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలతో కలిసిన అమరీందర్‌ ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది.

అయితే అమరీందర్‌ సింగ్ స్వయంగా పార్టీని పెడుతున్నట్లు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైనట్లు ప్రకటించారు. ఈ మేరకు అమరీందర్‌ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. పంజాబ్ ప్రయోజనాల కోసం, ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతుల కోసం తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు అమరీందర్ సింగ్. 

Tags:    

Similar News