ఆర్టికల్ 370 రద్దు అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. యూపీలోని సోంభద్రలో పర్యటించిన ఆమె భూ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతుందని చెప్పుకొచ్చారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అంతర్గతంగా చర్చిస్తామని అన్నారు.