Breaking: కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు

మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

Update: 2020-05-30 10:07 GMT

మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. జూన్ 1 ప్రారంభ తేదీకి కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాకినట్టు స్కైమెట్ నివేదించింది. అయితే రుతుపవనాల రాకపై ప్రభుత్వ యాజమాన్యంలోని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.జూన్ 1 న రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇటీవల IMD తెలిపింది. కాగా 2019 లో, రుతుపవనాలు కేరళలో ఆలస్యంగా(జూన్ 8న) ప్రారంభమయ్యాయి.

దాంతో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో దాని పురోగతి మందగించింది, ఇది జూన్లో సాధారణ వర్షానికి దారితీసింది. అయితే, ఈ సంవత్సరం అనుకున్నదానికంటే ముందుగానే రుతుపవనాలు రావడంతో సీజన్ మొదట్లోనే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు వస్తాయని IMD అంచనా వేసింది. కాగా జూన్-సెప్టెంబర్ రుతుపవనాల వర్షపాతం 88 సెం.మీ దీర్ఘకాలిక సగటు (ఎల్‌పిఎ) కు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని ఏప్రిల్‌లో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ నాయర్ తెలిపారు.

Tags:    

Similar News