Narendra Modi: పెట్రోల్ ధరలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Narendra Modi: పెట్రోల్‌పై ఎక్సైజ్ సంకాన్ని కేంద్రం తగ్గించినా రాష్ట్రాలు తగ్గించడంలేదు

Update: 2022-04-27 09:18 GMT

Narendra Modi: పెట్రోల్ ధరలపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు 

Narendra Modi: పెట్రోల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సంకాన్ని కేంద్రం తగ్గించినా కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించడంలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గత నవంబర్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందన్నారు మోడీ. ఆ తర్వాత పన్ను తగ్గించాలని రాష్ట్రాలను అభ్యర్థించామన్నారు. కానీ ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు తగ్గించినా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు సుంకాన్ని తగ్గించలేదన్నారు. అయితే తాను ఎవరినీ విమర్శించడం లేదన్న మోడీ వెంటనే వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు ప్రయోజనాలను అందించాలని రాష్ట్రాలను కోరారు. 

Tags:    

Similar News