Narendra Modi Tour: యూపీలోని సిద్ధార్థనగర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ

*9 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన నరేంద్ర మోడీ *గత ప్రభుత్వాలు పూర్వాంచల్‌ను గాలికొదిలేశాయి -మోడీ

Update: 2021-10-25 11:45 GMT

యూపీలోని సిద్ధార్థనగర్‌లో పర్యటించిన ప్రధాని మోడీ(ఫైల్ ఫోటో)

Narendra Modi Tour: యూపీలోని సిద్ధార్థనగర్‌లో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులో భాగంగా 9 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు ఆయన. పూర్వాంచల్‌ ప్రజలను గత ప్రభుత్వాలు గాలికొదిలేశాయన్న మోడీ తమ హయాంలో పూర్వాంచల్‌ ప్రాంతాన్ని ఉత్తరాదికే మెడికల్‌ హబ్‌గా మార్చామని చెప్పుకొచ్చారు. గత పాలకులు తమ కుటుంబ లాకర్లు నింపుకోవడంలో తలమునకలై స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశారని విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News