ఇది మహోన్నత ఘట్టం
250వ రాజ్యసభ సమావేశాల సందర్భంగా ప్రతి ఒక్క సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 250వ రాజ్యసభ సమావేశాల సందర్భంగా ప్రతి ఒక్క సభ్యులకి శుభాకాంక్షలు తెలిపారు. 250వ రాజ్యసబ సమావేశాలంలే ఇదో మహాన్నత ఘట్టమని ఇందులో పాలుపంచుకోవడం నా అదృష్టమన్నారు. ఈ సభ చరిత్రను చూసింది, చరిత్రను మారుస్తుందనడంలో సందేహం లేదన్నారు. రాజ్యసభకు సభ్యులు వస్తుంటారు. పోతుంటారు. ఇదిశాశ్వతమైనది. భారత దేశ సమాఖ్య విధానానికి రాజ్యసభ్య ఆత్మవంటిది. లోక్ సభ కేత్రస్థాయిని చూస్తే రాజ్యసభ దూరదృష్టితో చూస్తుందని మోదీ అన్నారు.
ఆర్టికల్ 370, 35ఏలో రాజ్యసభ పాత్ర మరవలేమని మోదీ తెలిపారు. 2003లో వాజ్ పేయీ చెప్పినట్లు ఇది రెండో సభ కాదన్నారు. ఈ సందర్భంగా మోదీ సర్వేపల్లి రాధకృష్ణన్ మాటను గుర్తు చేశారు. ఆలోచనలు విధానాలే రెండు సభల ఔన్నత్యాన్ని చాటిచెబుతాయని సర్వేపల్లి రాధకృష్ణన్ మాటలు గుర్తు చేశారు.