ఈనెల 16 ,17 తేదీల్లో సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

Update: 2020-06-12 16:22 GMT

ఈనెల 16 ,17 తేదీల్లో సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించనున్నారు. 16వ తేదీన 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారు.

ఆ తరువాత 17న మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమావేశం కానున్నారు. ఇందులో ప్రధానంగా కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అంశాలపైనే చర్చ ఉంటుందని సమాచారం. కరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 24 న లాక్డౌన్ మొదటి దశ ప్రకటించినప్పటి నుండి ముఖ్యమంత్రులతో పిఎం మోడీ ఆరవసారి వర్చువల్ గా సమావేశమవుతున్నారు. గత కొన్ని రోజులుగా లాక్ డౌన్‌లో కేంద్రం మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

మినహాయింపులు ఇచ్చిన తరువాత కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ భేటీ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News