Prashant Kishor: బెంగాల్లో పని ముగిసింది.. పంజాబ్ వెళ్ళేందుకు రెడీ...
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నెక్స్ట్ టార్గెట్ నిర్ణయించుకున్నారు.
Prashant Kishor: బెంగాల్లో పని ముగిసింది.. పంజాబ్ వెళ్ళేందుకు రెడీ...
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నెక్స్ట్ టార్గెట్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల్లో పీకే తలమునకలై ఉన్నారు. మమతా బెనర్జీని మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని పీకే తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్ బాధ్యతలు ముగియగానే ఆయన పంజాబ్ వెళతారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి తగిన వ్యూహాలు తయారుచేయబోతున్నారు. ఇప్పటికే సీఎం అమరీందర్ సింగ్కు ప్రిన్సిపల్ అడ్వైజర్గా పీకే నియమితులయ్యారు.