PM Narendra Modi: ముగిసిన మోడీ పర్యటన

PM Narendra Modi: భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు కీలక అవగాహనా ఒప్పందాలు జరిగాయి.

Update: 2021-03-27 15:27 GMT

నరేంద్ర మోడీ (ఫైల్ ఫొటో)

PM Narendra Modi: భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు కీలక అవగాహనా ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల ఉన్నతాధికారులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడతాయని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రెండు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటన నేటితో ముగిసింది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా బంగ్లాదేశ్‌కు చెందిన 50 మంది పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోడీ ఆహ్వానించారు.

Tags:    

Similar News