జమ్మూకశ్మీర్‌లో ఇవాళ ప్రధాని మోడీ టూర్.. భద్రత కట్టుదిట్టం...

Narendra Modi: ప్రధాని మోడీ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పంచాయతీలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు...

Update: 2022-04-24 03:12 GMT

జమ్మూకశ్మీర్‌లో ఇవాళ ప్రధాని మోడీ టూర్.. భద్రత కట్టుదిట్టం...

Narendra Modi: ఇవాళ ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్ లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోడీ పర్యటనకు ముందు జమ్మూలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అమరుడయ్యారు. అనంతరం భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రధాని మోడీ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా పంచాయతీలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతాదళాలతో కలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి.

Tags:    

Similar News