PM Modi: వందే భారత్ రైలులో ప్రయాణించిన ప్రధాని
PM Modi: గాంధీనగర్-ముంబై మధ్య అత్యంత వేగంగా నడవనున్న రైలు
PM Modi: మోడిఫై చేసిన వందే భారత్ రైలు పట్టాలెక్కింది. గుజరాత్లోని గాంధీనగర్లో జెండా ఊపి రైలును ప్రారంభించారు ప్రధాని మోడీ. వందే భారత్ రైలులో గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గాంధీ నగర్, ముంబై మధ్య అత్యంత వేగంగా ప్రయాణికులను చేరవేసే ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఈ రైళ్లలో విమానాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలు.. మెరుగైన ప్రయాణికుల భద్రతా ఫీచర్లు కూడా వందే భారత్ రైలు సొంతం. రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు.