లాల్ బహదూర్ శాస్త్రి 115వ జయంతి.. ప్రధాని మోదీ ఘన నివాళి

భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించడానికి ప్రధాని మోడీ విజయ్ ఘాట్ చేరుకున్నారు.

Update: 2019-10-02 04:55 GMT

భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించడానికి ప్రధాని మోడీ విజయ్ ఘాట్ చేరుకున్నారు. అంతకుముందు పిఎం మోడీ దేశ పితామహుడు మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి భారత రెండవ ప్రధానమంత్రి. మాజీ ప్రధాని 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో దేశానికి నాయకత్వం వహించారు. ఆయన 'జై జవాన్ జై కిసాన్' నినాదానికి తెచ్చారు.1951లో శాస్త్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.1966లో లాల్ బహదూర్ శాస్త్రికి భారతరత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.

Tags:    

Similar News