వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలి: ప్రధాని మోదీ

Modi:కరోనాపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Update: 2021-04-04 13:38 GMT

మోడీ ఫైల్ ఫోటో 

Modi: కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఐదు వ్యూహాలతో ముందుకు పోవాలని ప్రధాని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐదు వ్యూహాలతో కరోనాను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్, కరోనా నిబంధనలు పాటించడం, వేగంగా వ్యాక్సినేష్ అందించడం లాంటి వాటి ముందుకు పోవాలని ప్రధాని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గడ్‌లకు కేంద్ర బృందాలు పంపాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు..

Tags:    

Similar News