PM Modi: బిహార్లో నేడు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
PM Modi: గయా గాంధీ మైదాన్లో ప్రధాని మోడీ బహిరంగసభ
PM Modi: లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 400 ఎంపీ సీట్లే టార్గెట్గా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది కాషాయదళం. ఇవాళ ప్రధాని మోడీ బిహార్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గయా గాంధీ మైదాన్లో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. ఇక పూర్నియాలో ప్రధాని మోడీ ర్యాలీ, బహిరంగ సభ ఉండనుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రాంతానికి అందించిన సౌకర్యాలు, ప్రగతికి చేసిన కృషి గురించి మోడీ ప్రజలకు వివరించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేశారు.