ఢిల్లీలో గురునానక్ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి మోడీ పాల్గొన్నారు.

* సిక్కు గురువుల బోధనలు, గురునానక్ జీవన విధానం ప్రపంచానికి సన్మార్గం చూపించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు

Update: 2022-11-08 02:09 GMT

ఢిల్లీలో గురునానక్ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి మోడీ పాల్గొన్నారు

Prime Minister Modi: సిక్కు గురువుల బోధనలు, గురునానక్ జీవన విధానం ప్రపంచానికి సన్మార్గం చూపించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. సిక్కుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. సిక్కుల కుటుంబీకులు ఉపాధికోసం, వ్యాపార కార్యకలాపాలకోసం పొరుగుదేశాలకెళ్లి అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతుండటం బాధాకరమన్నారు. పొరుగుదేశాల్లో ఇబ్బందులుపడుతున్నవారు భారత్ దేశం తిరిగొస్తే భారతీయ పౌరసత్వం ఇస్తామన్నారు.

Tags:    

Similar News