థ్యాయ్‌లాండ్‌లో పర్యటించనున్నప్రధాని మోదీ

Update: 2019-11-02 05:46 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు థ్యాయ్‌లాండ్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం థాయ్ లాండ్ పర్యటనకు బయల్దేరారు. తూర్పు ఆసియా 14వ సదస్సుతో పాటు ఆసియన్ ఇండియా సదస్సులోను ఆయన పాల్గొననున్నారు. థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ ఛాన్ ఓ ఛా ఆహ్వానం వేరకు మోదీ బ్యాంకాక్ లో పర్యటించనున్నారు. మొదటి సిక్కు గురువులలో ఒకరు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేస్తున్న ఓ కార్యక్రమంలోను మోదీ పాల్గొంటారు.

మూడో తేదీ ప్రధాని ప్రయుత్ లో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, భద్రత వంటి కీలక అంశలపై చర్చించనున్నారు. అనంతరం థాయ్ లాండ్ లో స్థిరపడి ఉంటున్న భారతీయులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిచనున్నారు. 

Tags:    

Similar News