బిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
Bihar: పాట్నాలోని తన టీ స్టాల్ను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
Bihar: బిహార్లో గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీగా ప్రసిద్ధి చెందిన ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతమైంది. తాను జీవనోపాధి కోసం నడుపుతున్న టీ స్టాల్ను పాట్నామున్సిపల్ అధికారులు తీసేయడంతో వెక్కివెక్కి ఏడ్చింది. ఈ అంశం మీడియాలోనూ వైరల్ అయింది. తనకు సాయం చేయాలంటూ ప్రియాంకా గుప్తా.. నేరుగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్లను కలిశారు. దీంతో వారు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తేజస్వి యాదవ్ ఆదేశాల మేరకు ప్రియాంకా గుప్తా టీ స్టాల్ను మున్సిపల్ అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంపై 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' సంతోషం వ్యక్తం చేసింది. బిహార్లోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక కామర్స్లో డిగ్రీ పట్టా పొందారు. అయితే నెలల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె టీ స్టాల్ పెట్టాలని నిర్ణయించుకుంది. 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' పేరిట పాట్నాబోరింగ్ రోడ్లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ టీ స్టాల్ ఫేమస్ అయింది.