ఢిల్లీలో 12 ఆసుపత్రుల మూసివేతకు కాలుష్యమండలి ఆదేశం

Update: 2019-06-28 11:01 GMT

కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) నగరంలోని 12 ఆసుపత్రులను మూసివేయాలని నోటీసులు జారీ చేసింది. బయో మెడికల్‌ వేస్ట్‌ నిబంధనలను పాటించడం లేదనే కారణంతో ఆ ఆసుపత్రుల మూసివేతకు డిపిసిసి నోటీసులు ఇచ్చింది. మొత్తం 56 ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని గుర్తించినట్లు డిపిసిసి పేర్కొంది. వాటిలో 12 ఆసుపత్రుల మూసివేతకు నోటీసులు జారీ చేసినట్లు, రోగులను పంపించివేసి ఆసుపత్రులను మూసివేయడానికి వారం రోజుల గడువు ఇచ్చినట్లు డిపిసిసి తెలిపింది.



Tags:    

Similar News