భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన నోబెల్
భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతల ప్రకటన ముగ్గురు శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్.. డిడియర్ క్విల్లోజ్కు సంయుక్తంగా నోబెల్ పురస్కారం
భౌతికశాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించారు. ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది. అంతరిక్షంలో భౌతికాంశాలపై విశిష్ట పరిశోధనలకుగాను.. జేమ్స్ పీబుల్స్ను నోబెల్ పురస్కారానికి జ్యూరీ ఎంపిక చేసింది. సౌరవ్యవస్థను పోలిన నక్షత్రాన్ని కనిపెట్టినందుకు మైఖేల్ మేయర్, డిడియర్ క్విల్లోజ్కు సంయుక్తంగా నోబెల్ పురస్కారం దక్కింది. అక్టోబర్ 9న రసాయన శాస్త్రం, అక్టోబర్ 10న సాహిత్యం, అక్టోబర్ 11న శాంతి, అక్టోబర్ 14న ఆర్థికశాస్త్రానికి సంబంధించిన విజేతల పేర్లను ప్రకటించనున్నారు.
This year's Physics Laureates Michel Mayor and Didier Queloz have explored our home galaxy, the Milky Way, looking for unknown worlds. In 1995, they made the first discovery of a planet outside our solar system, an exoplanet, orbiting a solar-type star, 51 Pegasi.#NobelPrize pic.twitter.com/XAZ1CZD40m
— The Nobel Prize (@NobelPrize) October 8, 2019