ఏపీకి కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. ప్రత్యేక పన్ను రాయితీలు కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. లోక్సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పారు. పన్ను రాయితీలు ఏపీకి ఇస్తే, ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సివస్తుందని గడ్కరీ తెలిపారు. సరైన ప్రతిపాదనలతో రాష్ట్రాలు వస్తే కేంద్రం పరిశీలించి ప్రోత్సాహకాలు ఇస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు.